మే23 న ఖచ్చితంగా ఓడిపోయో టీడీపీ నేతలు వీరే..!

ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన తర్వాత తెలుగు తమ్ముళ్లందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది. అయినా ఎక్కడో చిన్న ఆశ, పసుపు-కుంకుమ పేరుతో ఓ భరోసా ఉండేది. ప్రస్తుతం ఆ ఆశ కూడ పటాపంచల్ అయ్యింది. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఉన్న ఆ కొద్ది నమ్మకం కూడా పోయింది. ఇక పూర్తిగా వారి భ్రమలు వీడడానికి ఇక కేవలం మూడు రోజులు మాత్రమే టైముంది. ఈలోగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అయితే చంద్రబాబు హయాంలో అవినీతి మేత మేసినవారంతా ఈ లిస్ట్ లో ఉన్నారు. పోనీ పార్టీ ఫిరాయిద్దాం అనుకుంటే, అలాంటివి ప్రోత్సహించే రకం కాదు జగన్. ఇతరత్రా ప్రలోభాలకు లొంగే రకం అంతకంటే కాదు. అందుకే ఈ నేతల్లో ఈ వణుకు.
సీఆర్డీఏ పేరుతో అమరావతి కుంభకోణాలు చేసిన మంత్రి నారాయణ,
నీరు-చెట్టు, వ్యవసాయ పనుల్లో కోట్ల రూపాయలు వెనకేసుకున్న సోమిరెడ్డి,
చంద్రబాబు వాటాలు పోగా.. ప్రాజెక్టుల పనుల్లో ఓ రేంజ్ లో తన చెయ్యి వాటా చూపించిన దేవినేని,
కాల్ మనీ వ్యాపరంతో కోట్లు దోచుకున్న బుద్దా వెంకన్న,
ఇసుక దందాతో అచ్చెమ్ నాయుడు, హత్య రాజకీయలతో కేయి ఫ్యామీలీ.
వీళ్లతో పాటు చాలా అక్రమాలు చేసిన దాదాపు టీడీపీ నేతలంతా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసి ఓటమి భయంతో భయపడుతున్నారు.


Post a Comment

0 Comments