మే20న ఇండియాలో రెడ్మి నోట్7S ఈవెంట్ లాంచ్

Xiaomi సంస్థ గత ఫిబ్రవరిలో రెడ్మి నోట్7ను రిలీజ్ చేసారు.దాని తరువాత ఇప్పుడు మళ్ళీ తన హవా చాటడానికి 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తో రెడ్మి నోట్7Sను ఇండియాలో మే 20న ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు.గురువారం కొన్ని టీజర్స్ ద్వారా Xiaomi తన కొత్త ఫోన్ రెడ్మి నోట్ 7Sను రిలీజ్ చేస్తున్నట్లు ధృవీకరించింది.

redmi note 7s india launch may 20 specifications

కొత్త ఫోన్ Redmiనోట్7 ప్రో లాగానే వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది.భారత్ లో రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7 వేరియంట్ కు ఉన్నట్లు ఈ ఫోన్ కు కూడా మంచి అవకాసం ఉంటుంది.

ఈవెంట్ లాంచ్

ఈ రోజు శుక్రవారం Xiaomi ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ చేసిన పోస్ట్ ద్వారా ఇండియాలో రెడ్మి నోట్ 7S యొక్క ప్రారంభ తేదీని మే 20 గా సెట్ చేయబడింది అని నిర్దారణ చేసారు.రెడ్మీ నోట్ సిరీస్ లో 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్న ఫోన్ గా ఈ ఫోన్ ను నిర్దారించారు.

రెడ్మి నోట్7 ధరలు:

రెడ్మి నోట్ 7S

రెడ్మి నోట్ 7Sను ధృవీకరించడానికి జైన్ ట్వీట్ చేసిన ఫొటోలో ఈ కొత్త హ్యాండ్ సెట్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో ఉందని తెలుస్తోంది. సెకండరీ కెమెరా మెగాపిక్సెల్ సెన్సార్ ఇంకా వెల్లడించలేదు.

Post a Comment

0 Comments